- చంద్రబాబు పాలనలో భారీ అవినీతి
Feb 14, 2020,
బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు
అమరావతి: లోకేష్ తింగరి మంగళం కాదని.. విషయాన్ని పక్కదారి పట్టించాలనే వైఎస్సార్సీపీపై ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి పరుడికి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశంపై నారా లోకేష్ను స్పందించాలని కేంద్రం కోరలేదన్నారు. మిత్ర పక్షంగా ఉండి కూడా మోదీని చంద్రబాబు దూషించారన్నారు. బాబు రూలింగ్ కాదని..ట్రేడింగ్ చేశారన్నారు. గత ఐదేళ్లలో చంద్రబాబు రియల్ ఎస్టేట్ ట్రేడింగ్ చేశారని తెలిపారు. డొల్ల కంపెనీలు సృష్టించి నిధులు దారి మళ్లించారని ధ్వజమెత్తారు. తప్పు చేసి తప్పించుకోవడంలో బాబును మించిన మేధావి లేరని ఎద్దేవా చేశారు. రూ.2 వేల కోట్లు అనేది చిన్నదని.. ఇంకా పెద్ద కుంభకోణం ఉందని తెలిపారు. కేవలం మాజీ పీఎస్ దగ్గరే రూ.2 వేల కోట్లకు ఆధారాలు దొరికాయన్నారు. చంద్రబాబు పాలనలో భారీ అవినీతి జరిగిందన్నారు. చంద్రబాబు దేశ ద్రోహానికి పాల్పడ్డారని సోము వీర్రాజు విమర్శించారు.
చంద్రబాబు పాలనలో భారీ అవినీతి